హై ఓల్టేజీతో గృహోపకరణాలు దగ్ధం

ABN , First Publish Date - 2021-05-11T06:23:27+05:30 IST

స్థానిక జానకినగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా హై ఓల్టేజీ రావడంతో ఏసీ, ఇన్వర్టర్‌, ఫ్యాన్లు, మోటార్లు, బల్బులు సుమారు పది ఇళ్లలో కాలిపోవడంతో రూ.3 లక్షలు వరకు నష్టం జరిగిందనిబాధితులు తెలిపారు.

హై ఓల్టేజీతో గృహోపకరణాలు దగ్ధం

ఆకివీడు, మే 10:  స్థానిక జానకినగర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా  హై ఓల్టేజీ  రావడంతో ఏసీ, ఇన్వర్టర్‌, ఫ్యాన్లు, మోటార్లు, బల్బులు సుమారు పది ఇళ్లలో కాలిపోవడంతో రూ.3 లక్షలు  వరకు నష్టం జరిగిందనిబాధితులు తెలిపారు. బాధితులైన గంటా ఈశ్వరరావు, కాకరాల అబ్రహంలింకన్‌, మల్లెలు దావీదు, వెలమల భాస్కరరావు, బొత్సా రాము, తాడెళ్ల నారాయణరావు తదితరులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం బల్బులు వెలగడం, ఆరడం జరుగుతుండడంతో విద్యుత్‌ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేసి వెళ్లారని, ఎర్త్‌ వదిలేయడంతో ఈ విధంగా జరిగిందని సిబ్బంది చెబుతున్నారన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన తమకు జరిగిన నష్టాన్ని  భర్తీ చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా బాధితుల సమాచారం మేరకు సిబ్బంది వచ్చి ట్రాన్స్‌ఫారంనకు మరమ్మతులు చేస్తున్నారు.

Updated Date - 2021-05-11T06:23:27+05:30 IST