పేదలు ఇల్లు కట్టుకుంటే అక్రమ టాక్స్ వేస్తున్నారు: రఘురామ
ABN , First Publish Date - 2022-03-21T21:26:14+05:30 IST
పేదలు ఇల్లు కట్టుకుంటే అక్రమ టాక్స్ వేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు దయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
ఢిల్లీ: పేదలు ఇల్లు కట్టుకుంటే అక్రమ టాక్స్ వేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు దయ్యబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క అవకాశం అనే స్లోగన్తో ఎన్నికల్లో గెలిచామని గుర్తుచేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి సరికాదని హితవుపలికారు. జగనన్న జప్తు పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో పెగాసెస్ ఉంటే ప్రభుత్వానికి తెలుస్తుంది కదా? అని ప్రశ్నించారు. అప్పుడప్పుడూ సీఎం జగన్ ఇజ్రాయిల్ ఎందుకెళ్తున్నారని, జగన్ ఇజ్రాయిల్లో ఏం కొన్నారో చెప్పాలి? అని రఘురామ ప్రశ్నించారు.