అక్రమ హౌస్ అరెస్టులను ఖండిస్తున్నాం: పట్టాభి

ABN , First Publish Date - 2022-07-17T17:56:04+05:30 IST

డీపీ నేతల అక్రమ హౌస్ అరెస్టులను ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత పట్టాభి అన్నారు. చలో రేపల్లెకు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారని

అక్రమ హౌస్ అరెస్టులను ఖండిస్తున్నాం: పట్టాభి

విజయవాడ: టీడీపీ నేతల అక్రమ హౌస్ అరెస్టులను ఖండిస్తున్నామని ఆ పార్టీ నేత పట్టాభి అన్నారు. చలో రేపల్లెకు వెళ్తున్న టీడీపీ నేతలను అరెస్టులు చేస్తున్నారని, బాధితులను పరామర్శించడం కూడా నేరమా? అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ మద్యం తాగి ఇద్దరు అన్యాయంగా చనిపోయారని తెలిపారు. కల్తీ మద్యం తాగి ఇద్దరు మరణిస్తే ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని తప్పుబట్టారు. కల్తీ మద్యం వ్యాపారాన్ని టీడీపీ అడ్డుకుంటుందని తెలిపారు. రేపల్లె ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని పట్టాభి డిమాండ్ చేశారు.

Updated Date - 2022-07-17T17:56:04+05:30 IST