గృహ నిర్బంధం పిరికిపంద చర్య
ABN , First Publish Date - 2020-08-03T09:36:20+05:30 IST
గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా అమరావతి పరిరక్షణ సమితి విద్యార్థి విభాగం కన్వీనర్ పొట్లూరి దర్శిత్ అభివర్ణించారు.
భారతీనగర్, ఆగస్టు 2: గృహ నిర్బంధం చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్యగా అమరావతి పరిరక్షణ సమితి విద్యార్థి విభాగం కన్వీనర్ పొట్లూరి దర్శిత్ అభివర్ణించారు. దర్శిత్ను ఆదివారం గృహ నిర్బంధం చేశారు. మూడు రాజధానుల నిర్మాణం విషయంలో జేఏసీ చేపట్టే ఎటువంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనకుండా... పోలీసులు ఆదివారం ఉదయం 6 గంటలకు దర్శిత్ ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పిరికి పంద చర్యగా అభివర్ణించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టకుండా అమరావతిని ఏకైక రాజధానిగా ఉంచాలని ఇది ప్రజలు కోరిక అని డిమాండ్ చేశారు.