అసెంబ్లీలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ మధ్య వాడీవేడి చర్చ

ABN , First Publish Date - 2022-03-12T23:23:12+05:30 IST

శాసన సభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌

అసెంబ్లీలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ మధ్య వాడీవేడి చర్చ

హైదరాబాద్‌: శాసన సభ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్‌ మధ్య వాడీవేడి చర్చ జరిగింది. శాసనసభ చరిత్రలోనే ఆరేడు రోజుల్లో బడ్జెట్‌ను ముగించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు దెప్పి పొడిచారు. దీంతో శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. పద్దులపై కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా చర్చ జరిపారా అని మంత్రి ఎదురు దాడికి దిగారు. ఎన్ని రోజులైనా చర్చకు తాము సిద్ధమని మంత్రి తెలిపారు. 


ఇంచార్జ్ మంత్రి సంతకం లేకుండా జిల్లాలో ఏ ఒక్కపని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. శ్రీధర్‌బాబు వ్యాఖ్యలపై మంత్రి తలసాని స్పందించారు. రాజకీయ సంప్రదాయాలకు పురుడు పోసిందే కాంగ్రెస్‌ అని తలసాని పేర్కొన్నారు. మంచిని ప్రతిపక్షం అస్సలు ఒప్పుకోవడం లేదని తలసాని అన్నారు. 

Updated Date - 2022-03-12T23:23:12+05:30 IST