రూ.18.42 కోట్లతో హాస్టల్ భవనాలు
ABN , First Publish Date - 2022-04-12T15:56:09+05:30 IST
ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లో రూ.18.41 కోట్లతో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాల ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సచివాలయం నుంచి వీడియో
- ప్రారంభించిన సీఎం
చెన్నై: ఆదిద్రావిడ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఐదు జిల్లాల్లో రూ.18.41 కోట్లతో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం ఉదయం ప్రారంభించారు. చెంగల్పట్టు, నాగపట్టినం, నామక్కల్, రామనాధపురం, కల్లకురిచ్చి జిల్లాల్లో నిర్మించిన హాస్టల్ భవనాలు, ఐదు పాఠశాల భవనాలకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. చెంగల్పట్టులో కిలాంబాక్కంలో రూ.2.80 కోట్లతో, నాగల్కేనిలో రూ.2.44 కోట్లతో, నామక్కల్ జిల్లా కలాంకానిలో రూ.2.26 కోట్లతో, రామనాధపురం జిల్లా కాట్టుపరమకుడిలో రూ.1.01 కోట్లతో నిర్మించిన నాలుగు ఆదిద్రావిడ పాఠశాల తరగతి భవనాలను, నామక్కల్ జిల్లా సెంగరై, కల్లకురిచ్చి జిల్లా గోముఖిఅనైలో హాస్టల్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కయల్విళి సెల్వరాజ్, ఆదిద్రావిడుల గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు మదివానన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు.