ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-01-18T04:16:14+05:30 IST

జిల్లా ఆస్పత్రులలో ఆక్సిజన్‌ కొరత రానియ్యకూడదని, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలి
అధికారులతో చర్చిస్తున్న జేసీ వేణుగోపాల్‌రెడ్డి

అధికారులకు జేసీ వేణుగోపాల్‌రెడ్డి ఆదేశం

విశాఖపట్నం, జనవరి 17: జిల్లా ఆస్పత్రులలో ఆక్సిజన్‌ కొరత రానియ్యకూడదని, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మం దిరంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు, ఎల్‌ఎంఓ ట్యాంకులు, డీ టైపు సిలెండర్లు అవసరమైన స్థాయిలో సమకూర్చుకోవాలన్నారు.


ఈ సందర్భంగా ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న బెడ్స్‌ వివరాలు సేకరించారు.  జిల్లా స్థాయిలో ఆక్సిజన్‌ వార్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా ఆక్సిజన్‌ ఉత్పత్తి, రవాణా తదితరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. ఈ వార్‌ రూమ్‌లకు వివిధ శాఖల అధికారులను నోడల్‌ అధికారులుగా నియమిస్తామని చెప్పారు.


Updated Date - 2022-01-18T04:16:14+05:30 IST