అధికారులతో చర్చిస్తున్న జేసీ వేణుగోపాల్రెడ్డి
అధికారులకు జేసీ వేణుగోపాల్రెడ్డి ఆదేశం
విశాఖపట్నం, జనవరి 17: జిల్లా ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత రానియ్యకూడదని, ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఎల్ఎంఓ ట్యాంకులు, డీ టైపు సిలెండర్లు అవసరమైన స్థాయిలో సమకూర్చుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ప్రతి ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న బెడ్స్ వివరాలు సేకరించారు. జిల్లా స్థాయిలో ఆక్సిజన్ వార్ రూమ్లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా తదితరాలను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు అధికారులు తీసుకుంటారని తెలిపారు. ఈ వార్ రూమ్లకు వివిధ శాఖల అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తామని చెప్పారు.