మానవతా దృక్పథం చాటుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

ABN , First Publish Date - 2020-11-28T05:38:55+05:30 IST

నగరంలోని కంఠేశ్వర్‌ ఆలయం సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రోడ్డుపై పడి అపస్మారక స్థితిలో ఉండిపోయింది.

మానవతా దృక్పథం చాటుకున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌
మహిళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌

పెద్దబజార్‌, నవంబరు 27: నగరంలోని కంఠేశ్వర్‌ ఆలయం సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ శుక్రవారం రోడ్డుపై పడి అపస్మారక స్థితిలో ఉండిపోయింది. అటుగా వెళుతున్న జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ గమనించి సదరు గాయాలతోనున్న మహిళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి హుటాహుటిన తన కారులో ఆసుపత్రికి తరలించి స్కానింగ్‌, ఇతర వైద్యపరీక్షలు నిర్వహించి మహిళ కుటుంబసభ్యులకు సమాచారమందించి చికిత్స చేయించారు. ఓ వైద్యురాలిగా వృత్తిధర్మాన్ని కాపాడడంతోపాటు మానవతా దృక్పథం చాటుకున్న ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమారాజ్‌ను పలువురు అభినందించారు. 


Updated Date - 2020-11-28T05:38:55+05:30 IST