పేషెంట్ సొమ్ముతో పారిపోయిన ఆస్పత్రి అటెండెంట్!

ABN , First Publish Date - 2020-08-11T01:34:25+05:30 IST

కంటి ఆపరేషన్ కోసం వచ్చిన ఓ పేషెంట్ సొమ్ము తీసుకొని పారిపోయాడో ఆస్పత్రి అటెండెంట్.

పేషెంట్ సొమ్ముతో పారిపోయిన ఆస్పత్రి అటెండెంట్!

న్యూఢిల్లీ: కంటి ఆపరేషన్ కోసం వచ్చిన ఓ పేషెంట్ సొమ్ము తీసుకొని పారిపోయాడో ఆస్పత్రి అటెండెంట్. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్ ఆస్పత్రిలో జరిగింది.  జూలై నెలలో హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్.. బిల్లు కట్టాల్సిన రూ.60వేల సొమ్మును అటెండెంట్‌కు ఇచ్చి, మిగతా ప్రొసీజర్స్ కోసం వెళ్లాడు. అదే అదనుగా భావించిన సదరు అటెండెంట్ ఆ డబ్బు తీసుకొని పరారయ్యాడు. గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో ఉన్న అతన్ని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-11T01:34:25+05:30 IST