అట్టహాసంగా పట్టాలపంపిణీ

ABN , First Publish Date - 2021-01-21T06:53:20+05:30 IST

జిల్లాలో పట్టాల పంపిణీ ప్రక్రియ చివ రిరోజైన బుధవారం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వం గతనెల 25 నుంచి ఈనెల 20వతేదీ వరకు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశిం చింది.

అట్టహాసంగా పట్టాలపంపిణీ
పట్టాలు పంపిణీ చేస్తున్న మంత్రులు బొత్స, ఆదిమూలపు, ఎమ్మేల్యే టీజేఆర్‌, బూచేపల్లి




ఆఖరి రోజు జిల్లావ్యాప్తంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు

చీమకుర్తిలో మంత్రులు బొత్స, సురేష్‌, 

ఒంగోలు రూరల్‌లో బాలినేని హాజరు

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 20: జిల్లాలో పట్టాల పంపిణీ ప్రక్రియ చివ రిరోజైన బుధవారం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వం గతనెల 25 నుంచి ఈనెల 20వతేదీ వరకు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశిం చింది. ఆమేరకు బుధవారం చివరి రోజు కావడంతో జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అట్టహాసంగా పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చీమకుర్తిలో జరిగిన కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి బొత్స సత్య న్నారాయణ, విద్యాశాఖ మంత్రి సురేష్‌, కలెక్టర్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే సుధా కర్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఒం గోలు రూరల్‌ మండల గ్రామాల్లో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టా లు పంపిణీ చేశారు. చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బల రాం, గుడ్లూరులో ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, కురిచేడులో ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్‌, అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్యతో పాటు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన కార్య క్రమా ల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యప్రజాప్రతినిధులు పట్టాల పంపిణీ కార్యక్ర మంలో పాల్గొన్నారు. గురువారం నుంచి మిగిలిన లబ్ధి దారులకు యఽథావిధిగా పట్టాలు పంపిణీ చేయనున్నారు. 

Updated Date - 2021-01-21T06:53:20+05:30 IST