మిద్దె తోటల పెంపకం దారులకు Training

ABN , First Publish Date - 2022-06-25T21:09:33+05:30 IST

బాల్కనీలు, టెర్రస్ లపై కూరగాయలు, పూలు తదితర ఉత్పత్తును పండించే వారికి అవసరైన ట్రెయినింగ్(Training) ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యానవనశాఖ(telangana horticulture department) ఒక ప్రకటనలో వెల్లడించింది.

మిద్దె తోటల పెంపకం దారులకు Training

హైదరాబాద్: బాల్కనీలు, టెర్రస్ లపై కూరగాయలు, పూలు తదితర ఉత్పత్తును పండించే వారికి అవసరైన ట్రెయినింగ్(Training) ఇవ్వనున్నట్టు తెలంగాణ ఉద్యానవనశాఖ(telangana horticulture department) ఒక ప్రకటనలో వెల్లడించింది. జంటనగరాల్లో ఇంటి ఇంటి ఆవాసాలపైనా, బాల్కనీలలో కూరగాయల పెంపకం పై ఆసక్తి ఉన్నవారికి అర్బన్ ఫామింగ్ పధకం కింద ఈనెల 26వ తేదీన నాంపల్లి రెడ్ హిల్స్ లోని ఉద్యానశాఖ ట్రెయినింగ్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఉద్యానవనశాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం 100 రూపాయల ఫీజును చెల్లించాలని అన్నారు. 


ట్రెయినింగ్ లో నిపుణులతో మిద్దెతోటల సాగు గురించి, ప్రాధమిక అంశాలు, స్థల ఎంపిక, మొక్కల ఎంపిక, మట్టి మిశ్రమం, తయారీ విధానం, విత్తనాల ఎంపిక, సేంద్రీయ ఎరువుల యాజమాన్యము, నీటి యాజమాన్యం, సేంద్రీయ పద్దతిలో చీడ, పీడల నివారణ గురించి విపులంగా ట్రెయినింగ్ ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇతర విషయాలకు 9705384384 నెంబర్ వాట్సప్ మెసేజ్ ద్వరా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే 9705384384, 7997725411,7674072539 నెంబర్లకు ఫోన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చని అన్నారు. 

Updated Date - 2022-06-25T21:09:33+05:30 IST