కరోనా కల్లోలం: తల్లి మృతి చెందిన కొద్దిసేపటికే కుమార్తె కన్నుమూత!
ABN , First Publish Date - 2021-05-13T16:43:34+05:30 IST
కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్లోని...
కోటా: కరోనా సెకెండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాజస్థాన్లోని కోటా జిల్లాలో గల బినాయకా గ్రామంలో కరోనా మహమ్మారి తల్లీకుమార్తెలను కబళించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రామానికి చెందిన బద్రిలాల్ భార్య బర్ధి బాయి, ఆమె కుమార్తె సంగీత కరోనాతో బాధపడుతూ కొద్ది గంటల వ్యవధిలోనే ఇద్దరూ కన్నుమూశారు.
సంగీత బిటెక్ పూర్తిచేశారు. కరోనా సోకిన ఇద్దరూ కోలాలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కరోనాకు చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం బర్ది బాయి కరోనాతో కన్నుమూసింది. దీంతో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఇంతలోనే సంగీత కూడా మృతి చెందిందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. గ్రామంలో ఇప్పటివరకూ కరోనాతో నలుగురు మరణించారని గ్రామస్తులు తెలిపారు.