అఫ్ఘాన్ జైల్లో కూతురు.. ప్రధాని క్షమాభిక్ష కోరిన తల్లి!

ABN , First Publish Date - 2021-06-14T05:17:12+05:30 IST

అఫ్ఘానిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయురాలికి మోదీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలని ఆమె తల్లి కోరింది. కేరళకు చెందిన సదరు మహిళ..

అఫ్ఘాన్ జైల్లో కూతురు.. ప్రధాని క్షమాభిక్ష కోరిన తల్లి!

కాబూల్: అఫ్ఘానిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయురాలికి మోదీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలని ఆమె తల్లి కోరింది. కేరళకు చెందిన సదరు మహిళ.. అఫ్ఘానిస్తాన్‌లో తన భర్తతో కలిసి నివశిస్తోంది. అయితే ఆమె భర్త ఒక ఐఎస్ ఉగ్రవాది. అతను చనిపోయిన తర్వాత ఆమెను అఫ్ఘాన్ అధికారులు అరెస్టు చేసి జైల్లో వేశారు. ఆమెకు భారత ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టాలని ఆమె తల్లి కోరింది. ‘‘నాకు ప్రధాని మోదీపై పూర్తి నమ్మకం ఉంది’’ అని ఆ తల్లి చెప్పింది. తన కుమార్తెకు ప్రధాని క్షమాభిక్ష పెట్టి స్వదేశానికి తీసుకురావాలని కోరిన ఆమె.. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైతే, చట్టప్రకారం పోరాడి కుమార్తెను స్వదేశానికి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తానని ఆమె పేర్కొంది.

Updated Date - 2021-06-14T05:17:12+05:30 IST