దేశాభివృద్ధికి ఇదే తరుణం..విపక్షాలు కలిసిరావాలి: మోదీ

ABN , First Publish Date - 2022-01-31T17:55:40+05:30 IST

దేశాభివృద్ధికి ఇదే కీలక సమయమని, దేశ ఆర్థిక పురోగతి, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటి అంశాల్లో ప్రపంచానికి ..

దేశాభివృద్ధికి ఇదే తరుణం..విపక్షాలు కలిసిరావాలి: మోదీ

న్యూఢిల్లీ: దేశాభివృద్ధికి ఇదే కీలక సమయమని, దేశ ఆర్థిక పురోగతి, వ్యాక్సినేషన్ కార్యక్రమం వంటి అంశాల్లో ప్రపంచానికి భారత్‌పై మరింత విశ్వాసం పెంపొందించేలా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వేదిక కావాలని ప్రధాని అభిలషించారు. వీటన్నింటిపై అర్ధవంతంగా చర్చిచేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.


పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు మీడియాతో ప్రధాని మాట్లాడుతూ, బడ్జెట్ సమావేశాలకు ఎంపీలకు స్వాగతం పలుకుతున్నామని, ఇవాల్టి ప్రపంచ పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో గొప్పగొప్ప అవకాశాలున్నాయని, దేశాభివృద్ధికి కీలకమైన సమయంలో అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చర్చలు ఫలప్రదం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పురోగతి సరికొత్త శిఖరాలకు చేరుతుందని చెప్పారు.


Updated Date - 2022-01-31T17:55:40+05:30 IST