సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య

ABN , First Publish Date - 2022-02-16T22:14:07+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించిందనే కారణంతో

సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య

సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించిందనే కారణంతో తన కూతురిని ఓ తల్లి పొట్టన పెట్టుకుంది. జహీరాబాద్ మండలం హుగ్గేల్లిలో ఈనెల 14న ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. బాలిక తల్లి బుజ్జమ్మనే తన కూతురిని హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. గుర్తుతెలియని వ్యక్తులు చంపినట్లు పోలీసులను బుజ్జమ్మ తప్పుదోవ పట్టించింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. బుజ్జమ్మతో పాటు నర్సింలు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-16T22:14:07+05:30 IST