శ్రీసిటీ ఎండీకి గౌరవ డాక్టరేట్
ABN , First Publish Date - 2022-05-21T08:05:57+05:30 IST
ప్రముఖ పారిశ్రామికవాడ శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది.
24న నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రదానం
సత్యవేడు, మే 20: ప్రముఖ పారిశ్రామికవాడ శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డికి నెల్లూరు విక్రమ సింహపురి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈనెల 24న యూనివర్సిటీలో నిర్వహించనున్న ఏడో స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు రవీంద్ర సన్నారెడ్డికి ఆహ్వానపత్రిక అందజేశారు. సాంకేతిక, పారిశ్రామిక రంగాలకు చేసిన సేవలతోపాటు వెనుకబడిన ప్రాంతాలైన సత్యవేడు, వరదయ్యపాళెం, తడ మండలాలను ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఉద్యోగ అవకాశాలు సృష్టించే సమీకృత వ్యాపార నగరంగా మార్చడం వెనుక ఉన్న దార్శనికత, కృషికి గుర్తింపుగా రవీంద్ర సన్నారెడ్డిని ఈ గౌరవానికి ఎంపిక చేశారు.