ఆర్టీసీ కండక్టర్ల నిజాయితీ

ABN , First Publish Date - 2020-11-30T05:08:16+05:30 IST

తమకు దొరికిన బంగారాన్ని బాధితురాలికి అప్పగించి ఓ ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు నిజాయితీని చాటుకున్నారు.

ఆర్టీసీ కండక్టర్ల నిజాయితీ
బాధితురాలికి బంగారాన్ని అప్పగిస్తున్న ఆర్టీసీ సిబ్బంది


 దొరికిన బంగారం బాధితురాలికి అప్పగింత

గుజరాతీపేట: తమకు దొరికిన బంగారాన్ని బాధితురాలికి అప్పగించి ఓ ముగ్గురు ఆర్టీసీ కండక్టర్లు నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో శ్రీకాకుళం ఆర్టీసీ బస్‌స్టేషన్‌లోని నాన్‌స్టాప్‌ బు కింగ్‌ వద్ద నగరంలోని కెల్లవీధికి చెందిన బాసూరు మల్లిక, సుధాకర్‌ దంపతులు హ్యాండ్‌ బ్యాగును మరచిపోయి బస్సులో వెళ్లిపోయారు. ఈ బ్యాగు కండక్టర్లు ఎంవీఎస్‌ఎం కృష్ణ, కె.లక్ష్మి, జీఎస్‌ ప్రసాద్‌లకు దొరికింది. వెంటనే బ్యాగును బస్‌స్టేషన్‌ మేనేజర్‌ శ్యామ్యూల్‌కు అప్పగించారు. ఈ బ్యాగులో సుమారు 15 గ్రాముల బంగారు నక్లెస్‌, చెవి దిద్దులు ఉన్నాయి. ఈ ఆభరణాలు  మల్లికవేనని నిర్ధారించుకున్నాక బస్‌స్టేషన్‌ సెక్యూరిటీ జె.కృష్ణ ద్వారా ఆమెకు అప్పగించారు. 

 



Updated Date - 2020-11-30T05:08:16+05:30 IST