ఎస్పీ బాలసుబ్రమణ్యానికి నివాళి
ABN , First Publish Date - 2020-09-27T10:17:25+05:30 IST
స్థానిక త్యాగరాజవీధిలో బ్రాహ్మణ సేవాసంఘం ఆఽధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్రీకంఠి
గూడూరు, సెప్టెంబరు 26: స్థానిక త్యాగరాజవీధిలో బ్రాహ్మణ సేవాసంఘం ఆఽధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాపసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి శ్రీకంఠి రామ్మోహన్రావు, వైసీపీ నాయకుడు ఎల్లసిరి గోపాలరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకు చెందిన బాలసుబ్రమణ్యం తన మధురగానంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారన్నారు.
గూడూరులో కాళిదాసు కళానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటల పోటీల్లో ఆయన పాల్గొన్నారన్నారు. ఆయన మృతి తీరని లోటన్నారు. కార్యక్రమంలో ఆనిమెళ్ల శివకుమార్, గౌస్బాషా, ప్రభాకర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.