చోరీ కేసులో హోంగార్డు అరెస్టు
ABN , First Publish Date - 2022-06-25T05:35:03+05:30 IST
చోరీ కేసులో హోంగార్డు అరెస్టు
నరసన్నపేట: సెల్ఫోన్చోరీ కేసులో హోంగార్డును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్ఐ సింహాచలం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు... పెద్దపేటలోని బాపిస్టు చర్చిలో ఈ ఏడాది మార్చి 22 సెల్ఫోన్ చోరీ జరిగినట్టు చర్చిఫాదర్ జాన్ డేవిడ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టగా హోంగార్డు బోసు మధు ఈ చోరీకి పాల్పడినట్టు తేలింది. మధును కోర్టులో హాజరుపరచగా, వచ్చే నెల 6వ తేది వరకు రిమాండ్ విధించినట్టు ఎస్ఐ తెలిపారు.