25న హోంశాఖ సబ్‌ కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-15T08:10:27+05:30 IST

25న హోంశాఖ సబ్‌ కమిటీ సమావేశం

25న హోంశాఖ సబ్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ, మే 14(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన కేంద్ర హోం శాఖ సబ్‌ కమిటీ ఈ నెల 25న మరోసారి సమావేశంకానుంది. హోం శాఖ సంయుక్త కార్యదర్శి (కేంద్ర రాష్ట్రాల) అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగే సమావేశంలో పాల్గొనాలని తెలంగాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు, ఏపీ ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌కు కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. నాలుగు అంశాలతో సమావేశ ఎజెండాను ఖరారు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజన, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9 సంస్థల విభజన, సింగరేణి, ఏపీ భారీ యంత్రాల ఇంజనీరింగ్‌ సంస్థ (ఆప్మెల్‌) విభజన, చట్టంలో ఎక్కడా పేర్కొని లేని సంస్థల విభజన గురించి సమావేశంలో చర్చించనున్నారు. 

Updated Date - 2022-05-15T08:10:27+05:30 IST