పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అండ: Sucharita
ABN , First Publish Date - 2021-10-21T14:48:10+05:30 IST
పోలీసు అమరవీరులను స్మరించుకునే ఈ దినోత్సవం చాలా గొప్పదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
అమరావతి: పోలీసు అమరవీరులను స్మరించుకునే ఈ దినోత్సవం చాలా గొప్పదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. పోలీసు ఉద్యోగాన్ని వృత్తిలా కాకుండా సేవలా భావించే పోలీసులు ఎందరో ఉన్నారన్నారు. 21 రోజుల్లో దిశ చట్టం ద్వారా నిందితులను కటకటాలకు పంపవచ్చని తెలిపారు. పోలీసులకు మౌలిక సదుపాయాలను సీఎం జగన్ కల్పించారన్నారు. గ్రామ స్ధాయిలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 15 వేల మందిని మహిళా పోలీసులుగా గుర్తించామని తెలిపారు. పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు.