హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో మహిళలు అత్యాచారానికి గురైన ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఆరాతీశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ అత్యాచార ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, శిఖా గోయల్ తదితరులు హాజరయ్యారు.