దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరిచిపోలేం: మహమూద్ అలీ

ABN , First Publish Date - 2021-10-21T15:45:36+05:30 IST

విధి నిర్వహణ వీర మరణం పొందిన అమర వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నానని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.

దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరిచిపోలేం: మహమూద్ అలీ

హైదరాబాద్: విధి నిర్వహణ వీర మరణం పొందిన అమర వీరులకు ఘన నివాళి అర్పిస్తున్నానని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. గోశామహల్‌లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో హోంమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశ భద్రత కోసం పోలీసులు చేస్తున్న సేవలను మరచిపోలేమన్నారు. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణ త్యాగాలు చేశారన్నారు. 377 మంది పోలీసులు విధి నిర్వహణ లో అమరులైయ్యారని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. కరోనా క్లిష్టమైన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో 62 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని...ఇందులో 10 మంది హోమ్ గార్డులు చనిపోయారన్నారు.


కరోనా సమయంలో చనిపోయిన పోలీసులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంద ఆయన భరోసా ఇచ్చారు. ఉగ్రదాడి జరగకుండా, తీవ్ర వాదం లేకుండా పోలీసులు తమ విధులను ఎంతో శ్రద్దగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సీసీటీవీలు ఏర్పాటు చేసి నేరాలకు తగ్గించే కార్యక్రమం చేపట్టారన్నారు. నూతన పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసామని తెలిపారు. మహిళల భద్రతకు భరోసా సెంటర్లను ఏర్పాటు చేసి వారికి అండగా ఉంటున్నామన్నారు. గడిచిన ఏడేళ్ళలో ఎలాంటి మత ఘర్షణలు లేకుండా చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన బోనాలు, రంజాన్ పండుగలు ప్రశాంతంగా నిర్వహించామని అన్నారు. ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంమంత్రి మహమూద్ అలీ శ్రద్ధాంజలి ఘటించారు. 

Updated Date - 2021-10-21T15:45:36+05:30 IST