రమ్య మృతదేహాన్ని పరిశీలించిన హోంమంత్రి

ABN , First Publish Date - 2021-08-15T21:07:26+05:30 IST

జీజీహెచ్‌లో విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని సుచరిత అన్నారు.

రమ్య మృతదేహాన్ని పరిశీలించిన హోంమంత్రి

గుంటూరు: జీజీహెచ్‌లో విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని సుచరిత అన్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారని తెలిపారు. విచారణ త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సుచరిత భరోసా ఇచ్చారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని రమ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.  అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-15T21:07:26+05:30 IST