ఐటీ దాడులపై చంద్రబాబు స్పందించరే?: సుచరిత

ABN , First Publish Date - 2020-02-20T01:28:49+05:30 IST

ప్రజల్లో సానుభూతి పొందేందుకే సెక్యూరిటీ తగ్గించారని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. ప్రతి ఆర్నెళ్లకో సారి చంద్రబాబు ఇలాంటి

ఐటీ దాడులపై చంద్రబాబు స్పందించరే?: సుచరిత

అమరావతి: ప్రజల్లో సానుభూతి పొందేందుకే సెక్యూరిటీ తగ్గించారని చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని హోంమంత్రి సుచరిత విమర్శించారు. ప్రతి ఆర్నెళ్లకో సారి చంద్రబాబు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉందని చెప్పారు. చంద్రబాబుకు 153 మందితో భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో 45 మంది ఉన్నారు.. ఏ ఒక్కరిని తగ్గించలేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు హాని ఉంటే  కచ్చితంగా సెక్యూరిటీ ఇస్తామన్నారు. చంద్రబాబు పీఏ ఇంట్లో ఐదు రోజులు ఐటి సోదాలు చేస్తే దానిపై ఎందుకు మాట్లాడలేదని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. 


Updated Date - 2020-02-20T01:28:49+05:30 IST