‘స్పీకర్ దంపతులు’ కోసం మృత్యుంజయ హోమం
ABN , First Publish Date - 2021-05-06T05:04:29+05:30 IST
కరోనా బారినపడి శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వాణి దంపతులు కోలుకోవాలని కోరుతూ బుధవారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు.
కరోనా నుంచి కోలుకోవాలని పూజలు
విశాఖపట్నం, మే 5: కరోనా బారినపడి శ్రీకాకుళం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వాణి దంపతులు కోలుకోవాలని కోరుతూ చైల్డ్రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం (సీఆర్పీఎఫ్) రాష్ట్ర కన్వీనర్ గొండు సీతారాం బుధవారం మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు. సీతంపేటలో గల సాయిదత్త గాయత్రి ద్యాన పీఠం ప్రాంగణంలో పీఠం వ్యవస్థాపకుడు వెంకటశర్మ, వేద పండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా కష్టాల నుంచి ప్రజలు కూడా వేగంగా కోలుకోవాలని హోమం నిర్వహించినట్లు సీతారాం తెలిపారు.