కలికి యానాదిరెడ్డికి టీడీపీ నేతల నివాళి
ABN , First Publish Date - 2021-05-06T04:12:17+05:30 IST
మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి సూచనలతో బుధవారం టీడీపీ నేతలు పట్టణం లోని
కావలిటౌన్, మే 5: మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి సూచనలతో బుధవారం టీడీపీ నేతలు పట్టణం లోని కలికి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కావలి అభివృద్ధికి ఆయన కృషిని కొనియాడారు. నివాళులర్పించిన వారిలో టీడీపీ నేతలు గోసల గోపాల్రెడ్డి, జ్యోతి బాబురావు, కృష్ణారెడ్డి, ఏటూరి శివ, శానం హరి, కె గోపి, పంగా వెంగళ్రెడ్డి, అప్పల కల్యాళ్ చక్రవర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.