రేపటినుంచి రమజాన్ ఉపవాసాలు ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-13T12:37:35+05:30 IST

పవిత్ర రమజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని...

రేపటినుంచి రమజాన్ ఉపవాసాలు ప్రారంభం

బెంగళూరు (కర్ణాటక): పవిత్ర రమజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయని బెంగళూరు నగరంలోని మర్కజి రౌత్ ఎ హిలాల్ కమిటీ ప్రకటించింది. బెంగళూరు, బెల్గం, మైసూర్ తదితర నగరాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించడంతో రమజాన్ ఉపవాసాలు ఈ నెల 14వతేదీ బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు మర్కజి రౌత్ ఎ హిలాల్ కమిటీ వెల్లడించింది. ఢిల్లీ, భోపాల్, ముంబై, గుజరాత్, అలహాబాద్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నెలవంక కనిపించకపోయినా బుధవారం నుంచి రమజాన్ రోజాలు ప్రారంభిస్తామని ఉలేమాలు ఏకగ్రీవంగా తీర్మానించారు. రమజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసాలు ఉండటంతోపాటు దానధర్మాలు చేస్తుంటారు. రమజాన్ నెలలో దేశంలోని అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేయనున్నారు. తారావీహ్ నమాజ్ లతో రాత్రి వేళ మసీదులు భక్తులతో కళకళలాడనున్నాయి.

Updated Date - 2021-04-13T12:37:35+05:30 IST