ఆగస్టు 3వరకు పాఠశాలలకు సెలవులు
ABN , First Publish Date - 2020-05-28T11:03:40+05:30 IST
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 3వతేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు డీఈవో
నెల్లూరు (విద్య), మే 27 : ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆగస్టు 3వతేదీ వరకు జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు డీఈవో జనార్దనాచార్యులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుగా పాఠశాలలు తెరవకూడదని, నిబంధనలు అతిక్రమించినా, తరగతులు నిర్వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎస్ఎస్ఏలో జేసీ సమీక్ష
సర్వశిక్షాభియాన్ కార్యాలయంలో బుధవారం జేసీ ప్రభాకర్రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. నాడు - నేడు పథకం పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఏ ఈఈ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.