ఎస్ఆర్ఎంసీ గట్టుపై రంధ్రం
ABN , First Publish Date - 2021-07-31T05:52:59+05:30 IST
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సేఫ్టీవాల్ను ఆనుకుని లైనింగ్పై నుంచి 10 అడుగులకు పైగా రంధ్రం పడింది. గతంలో ఇదే ప్రాంతంలో కిందివైపు లైనింగ్ దెబ్బతినింది.
- కొట్టుకుపోయిన మత్య్సకారుడి బోటు
నందికొట్కూరు/జూపాడుబంగ్లా జూలై 30: పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సేఫ్టీవాల్ను ఆనుకుని లైనింగ్పై నుంచి 10 అడుగులకు పైగా రంధ్రం పడింది. గతంలో ఇదే ప్రాంతంలో కిందివైపు లైనింగ్ దెబ్బతినింది. అప్పట్లో అధికారులు మరమ్మతులు చేయలేదు. ప్రస్తుతం దానికి పైభాగంలో రంధ్రం పడింది. ప్రాజెక్టుకు ఇరువైపులా నిర్మించిన సేఫ్టీవాల్కు కూడా గతంలో భారీ పగుళ్లు వచ్చాయి. అప్పట్లో ప్రాజెక్టు సేఫ్టీ నిపుణుల బృందం వచ్చి పరిశీలించి మరమ్మతులు చేయించింది. ప్రస్తుతం నీటి ఉధృతికి ఎస్ఆర్ఎంసీపై గొయ్యి ఏర్పడింది. కాలువపై మత్స్యకారుడు ఉంచిన చేపల బోటు ఈ రంధ్రంలో కొట్టుకుపోయింది. అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు. ప్రాజెక్టు ఏఈ విష్ణువర్ధన్రెడ్డిని వివరణ కోరగా ఈ గొయ్యి వల్ల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. రంధ్రాన్ని పూడ్చేందుకు మరమ్మతు పనులు చేపట్టినట్లు చెప్పారు.