హాకీ ఇండియా సాయం 25 లక్షలు
ABN , First Publish Date - 2020-04-02T10:06:09+05:30 IST
దేశంలో కరోనా వైరస్ నిర్మూలనకు పీఎం కేర్స్ ఫండ్కు హాకీ ఇండియా (హెచ్ఐ) రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. బుధవారం జరిగిన సర్వసభ్య
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ నిర్మూలనకు పీఎం కేర్స్ ఫండ్కు హాకీ ఇండియా (హెచ్ఐ) రూ.25 లక్షల విరాళం ప్రకటించింది. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెచ్ఐ అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. ‘క్లిష్టమైన సమయంలో దేశానికి సాయం చేయడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాకీ క్రీడకు దేశ ప్రజలు ఎప్పుడూ అండగా నిలుస్తారు. కాబట్టి మా వంతుగా వారికి చిన్న సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నాం’. అని అహ్మద్ తెలిపారు.