కలెక్టరేట్లలోనే గణతంత్ర వేడుకలు

ABN , First Publish Date - 2022-01-24T05:11:06+05:30 IST

కలెక్టరేట్లలోనే గణతంత్ర వేడుకలు

కలెక్టరేట్లలోనే గణతంత్ర వేడుకలు

  కరోనా దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హనుమకొండ రూరల్‌, జనవరి 23: గణతంత్ర వేడుకల నిర్వహణపై కరోనా ప్రభావం పడింది. కరోనా ఉధృతి దృష్ట్యా ఈసారి గణతంత్ర వేడుకలను పరిమితంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమే్‌షకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని  ఉదయం 10గంటలకు కలెక్టరేట్‌ కార్యాలయాల ప్రాంగణాల్లో కలెక్టర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు వారి కార్యాలయాల ప్రాంగణాల్లోనే అవిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా భౌతికదూరాన్ని పాటించాలని, శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచాలని సూచించారు. 

Updated Date - 2022-01-24T05:11:06+05:30 IST