Mumbaiలో దారుణం: బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి అత్యాచారం

ABN , First Publish Date - 2022-02-11T15:59:07+05:30 IST

మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం జరిగింది.45 ఏళ్ల వయసున్న హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి తన మారు కూతురిపై అత్యాచారం చేసిన ఘటన...

Mumbaiలో దారుణం: బాలికపై హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి అత్యాచారం

ముంబై:మహారాష్ట్రలోని ముంబై నగరంలో దారుణం జరిగింది.45 ఏళ్ల వయసున్న హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తి తన మారు కూతురిపై అత్యాచారం చేసిన ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది.సౌత్ ముంబైలోని బాంబే హాస్పిటల్ సమీపంలోని తన గుడిసెలో నిందితుడు తన మారు కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.నిందితుడు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్(హెచ్ఐవీ) బారిన పడ్డాడు. అత్యాచారం చేయడం వల్ల మైనర్‌ బాలికకు కూడా హెచ్ఐవీ సోకిందా అనే కోణంలో పోలీసులు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నారు. తల్లి లేని సమయంలో బాలికపై అత్యాచారం ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. బాలిక తల్లి కూడా హెచ్ఐవి పాజిటివ్.ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు మైనర్‌బాలికను బెదిరించారు.


బాలిక తన పొరుగున ఉన్న ఓ మహిళతో తన గోడును వివరించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ తర్వాత మహిళ ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించింది.భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టం, 2012లోని సంబంధిత సెక్షన్ల కింద ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.నిందితుడి ఇంటికి ఒక బృందాన్ని పంపామని, కేసు నమోదు చేసిన అదే రోజు రాత్రి అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.శిశు సంక్షేమ కమిటీకి చెందిన నిపుణుల బృందం బాలికకు కౌన్సెలింగ్ చేస్తుంది. మైనర్‌బాలికపై గతంలో ఒక్కసారేనా లేదా పలుమార్లు అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Updated Date - 2022-02-11T15:59:07+05:30 IST