సెలూన్లో హైటెక్ వ్యభిచారం.. ముఠా గుట్టురట్టు
ABN , First Publish Date - 2021-01-15T15:30:44+05:30 IST
నెల్లూరు: నగరంలో సాగుతున్న హైటెక్ వ్యభిచారం ముఠా గట్టు రట్టయింది.
నెల్లూరు: నగరంలో సాగుతున్న హైటెక్ వ్యభిచారం ముఠా గట్టు రట్టయింది. దర్గామిట్టలో ప్లాటీనం సెలూన్ పేరుతో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. పోలీసులకు సమాచారం అందడంతో సెలూన్పై దాడి చేశారు. కోల్కత్తాకు చెందిన యువతితోపాటు ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా ప్లాటీనమ్ సెలూన్లో గుట్టుగా ఈ దందా నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.