ఛలో బస్ భవన్‌కు పిలుపు ఇచ్చిన హైర్ బస్సుల యజమానులు

ABN , First Publish Date - 2020-09-21T15:18:43+05:30 IST

హైదరాబాద్: ఛలో బస్ భవన్‌కు హైర్ బస్సుల యజమానులు పిలుపునిచ్చారు.

ఛలో బస్ భవన్‌కు పిలుపు ఇచ్చిన హైర్ బస్సుల యజమానులు

హైదరాబాద్: ఛలో బస్ భవన్‌కు హైర్ బస్సుల యజమానులు పిలుపునిచ్చారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ బస్సులు నడుపుకొని బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. మార్చి 22 నుంచి ఇప్పటివరకు హైదరాబాద్ సిటీలో సుమారు 400 బస్సులను పూర్తిగా నిలుపుదల చేశారని హైర్ బస్సుల యజమానులు వాపోతున్నారు. జిల్లాలలో కేవలం 25% బస్సులను నడుపుతూ, నడిపిన  కాలానికి కూడా బిల్లులు ఇవ్వకుండా ఆర్టీసీ మాత్రం వాళ్ల ఉద్యోగులకు పూర్తిస్థాయిలో జీతాలు చెల్లిస్తూ తమకు బిల్లు ఇవ్వకుండా అపుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-21T15:18:43+05:30 IST