‘కానిస్టేబుల్ వేధిస్తున్నాడు’
ABN , First Publish Date - 2020-08-15T16:19:20+05:30 IST
హిందూపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్..
అనంతపురం(ఆంధ్రజ్యోతి): హిందూపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వీరనారాయణ తనను వేధిస్తున్నాడని బాధిత మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వేధింపుల విషయమై గుత్తికి చెందిన కానిస్టేబుల్ వీరనారాయణపై 2016లో ఓ కేసు, 2017లో మరో కేసు నమోదైందన్నారు. ఈ విషయంపై రాజీకి రావాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారన్నారు. కానిస్టేబుల్ వేధింపులు ఎక్కువ కావడంతో తాను గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేశానని, ఈ ఫిర్యాదు విషయంపై గుత్తి సీఐ రాజశేఖరరెడ్డి విచారణ చేయకపోగా నిందితుడి తరపునే మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ కేసుకు సంబంధించి సీఐ న్యాయమైన విచారణ చేయకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు.