ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌

ABN , First Publish Date - 2021-12-03T05:21:26+05:30 IST

హిందూపు రం-గోరంట్ల ప్రధాన రహ దారిపై బాలంపల్లి క్రాస్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతి చెం దగా.. మరొకరు తీవ్రంగా గా యపడ్డారు.

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ట్రాక్టర్‌

ఒకరు మృతి, మరొకరికి గాయాలు 

హిందూపురం టౌన, డి సెంబరు 2: హిందూపు రం-గోరంట్ల ప్రధాన రహ దారిపై బాలంపల్లి క్రాస్‌ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్ర మాదంలో ఒకరు మృతి చెం దగా.. మరొకరు తీవ్రంగా గా యపడ్డారు. ఏఎస్‌ఐ జయ రాంరెడ్డి తెలిపిన మేరకు క ర్ణాటక యలహంక ప్రాంతా నికి చెందిన చందు (35), నా గప్ప హిందూపురం మం డ లం బాలంపల్లికి చెందిన రామచంద్ర కర్ణాటకలో సెం ట్రింగ్‌ పనులు చేస్తూ జీవించేవారు. రెండు రోజుల కిందట వీరు ముగ్గురు బాలంపల్లికి వచ్చారు. గురు వారం ముగ్గురూ పత్తికుంటపల్లికి వెళ్లి ద్విచక్ర వాహ నంపై తిరిగి వస్తుండగా హిందూపురం నుంచి గోరం ట్ల వెళ్తున్న ఇటుకల ట్రాక్టర్‌ బాలం పల్లిక్రాస్‌ వద్ద ఢీ కొంది. దీంతో ముగ్గురూ అదుపుతప్పి కిందపడ్డారు. ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న చందు అక్కడిక క్కడే మృతిచెందాడు. నాగప్పకు తీవ్రగా యాలయ్యా యి. ఆయనను వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆ స్పత్రికి  తరలించారు.  మెరుగైన వైద్యం కోసం బెం గ ళూరు తీసుకెళ్లారు. రామచంద్ర స్వల్పగాయాలతో బ యటపడ్డాడు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపడుతు న్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి పూర్తి వివ రాలు తెలియాల్సి ఉందన్నారు.





Updated Date - 2021-12-03T05:21:26+05:30 IST