హిందూ గ్రామాలు తగలబడుతున్నాయ్.. తస్లీమా ఆగ్రహం

ABN , First Publish Date - 2021-10-19T00:11:33+05:30 IST

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయని, హిందూ గ్రామాలు తగలబడుతున్నాయని రచయిత తస్లీమా నస్రీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో బూడిదవుతున్న గ్రామానికి సంబంధించిన ఒక ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆమె.. దేశంలో ఇంతటి సంక్షోభం కొనసాగుతోంటే ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫ్లూట్ వాయిస్తున్నారంటూ..

హిందూ గ్రామాలు తగలబడుతున్నాయ్.. తస్లీమా ఆగ్రహం

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు తీవ్రమయ్యాయని, హిందూ గ్రామాలు తగలబడుతున్నాయని రచయిత తస్లీమా నస్రీమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో బూడిదవుతున్న గ్రామానికి సంబంధించిన ఒక ఫొటోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆమె.. దేశంలో ఇంతటి సంక్షోభం కొనసాగుతోంటే ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా ఫ్లూట్ వాయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘బంగ్లాదేశ్‌లోని పిర్గంజ్, రంగాపూర్ జిల్లాల్లో ఉన్న రెండు హిందూ గ్రామాలు రాత్రి అగ్రికి ఆహుతయ్యాయి. కానీ హసీనా ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు’’ అని ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్‌లో దుర్గా మండపాలపై దాడితో ఈ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైనారిటీ మతస్తులైన హిందువులపై అక్కడి మెజారిటీ మతస్తులైన ముస్లింలు చేస్తున్న దాడులకు నిరసనగా మైనారిటీ వర్గాల ప్రజలు ఆదివారం దేశ వ్యాప్తంగా నిరాహార దీక్ష చేపట్టారు.

Updated Date - 2021-10-19T00:11:33+05:30 IST