అయోధ్య రామయ్య ఆలయంలో హిందూ ముస్లిం ఘంటానాదం

ABN , First Publish Date - 2020-08-10T06:54:47+05:30 IST

అయోధ్యలో నిర్మించే భయ్య రామాల యంలో నెలకొల్పే 2100 కిలోల బరువైన గంట హిందూ ముస్లిం ఘంటా నాదంగా మారింది. ఈ గంటకు ఇక్బాల్‌ మిస్త్రీ అనే ముస్లిం రూపకల్పన చేశారు...

అయోధ్య రామయ్య ఆలయంలో హిందూ ముస్లిం ఘంటానాదం

జలేసర్‌(యూపీ), ఆగస్టు 9: అయోధ్యలో నిర్మించే భయ్య రామాల యంలో నెలకొల్పే 2100 కిలోల బరువైన గంట హిందూ ముస్లిం ఘంటా నాదంగా మారింది. ఈ గంటకు ఇక్బాల్‌ మిస్త్రీ అనే ముస్లిం రూపకల్పన చేశారు. ఈ గంటను అష్టధాతువులతో తయారు చేసే బాధ్యతను ఇప్పుడు దావుదయాళ్‌ నేతృత్వంలోని బృందం చేపట్టింది. ఈ గంట తయారీ ఆర్డర్‌ను యూపీలోని జలేసర్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ వికాస్‌ మిట్టల్‌ కర్మాగారానికి నిర్మోహీ అఖాడా అప్పగించింది. 2.1 టన్నుల బరువైన గంట ను ఇక్బాల్‌ మిస్త్రీ, దావుదయళ్‌తో పాటు 25 మంది 4 నెలల్లో తయారు చేస్తారని మిట్టల్‌ చెప్పారు. దీని తయారీకి అయ్యే రూ.21 లక్షలను తామే భరిస్తామన్నారు. వీరికి కేదరనాథ్‌ ఆలయంలో 101 కిలోల గంటను, జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 1000 కిలోల గంటను తయారు చేసిన అనుభవం ఉంది. ఈ గంటను మోగిస్తే దాదాపు 15 కిలోమీటర్ల దాకా శబ్దం వినబడుతుందట!

Updated Date - 2020-08-10T06:54:47+05:30 IST