పుదుచ్చేరి జిప్‌మర్‌లో హిందీ అమలు

ABN , First Publish Date - 2022-05-09T08:41:12+05:30 IST

పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని అన్ని విభాగాల్లో హిందీ భాషను అమలు చేయాలని ఆ సంస్థ డైరెక్టర్‌ రాకేష్‌ అగర్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పుదుచ్చేరి జిప్‌మర్‌లో హిందీ అమలు

చెన్నై, మే 8(ఆంధ్రజ్యోతి): పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని అన్ని విభాగాల్లో హిందీ భాషను అమలు చేయాలని ఆ సంస్థ డైరెక్టర్‌ రాకేష్‌ అగర్వాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. జిప్‌మర్‌ ఆస్పత్రికి తమిళనాడు సహా పలు రాష్ట్రాల రోగులు చికిత్స కోసం వెళ్తుంటారు. ఇప్పటివర కూ ఆ ఆస్పత్రి, వైద్యకళాశాలలో తమిళం,ఆంగ్ల భాషలు వాడుకలో ఉండేవి. 1976 అధికార భాషా నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని సంస్థల్లో హిందీ అధికారిక భాషగా వర్తింపచేయాల్సి ఉందని, ఆ నేపథ్యంలో జిప్‌మర్‌ ఆస్పత్రి, వైద్యకళాశాలలో ఆ భాషనే అధికారిక భాషగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై డీఎంకే ఎంపీ కనిమొళి తీవ్రంగా స్పందించారు. జిప్‌మర్‌ ఆస్పత్రికి వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులు చికిత్స కోసం వెళ్తుంటారని, వైద్య కళాశాలలోనూ పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో ఆంగ్లానికి బదులుగా హిందీ భాషను నిర్బంధంగా ప్రవేశపెట్టడం గర్హనీయమన్నారు. 

Read more