అస్తవ్యస్తంగా హిమాయత్నగర్ రోడ్డు
ABN , First Publish Date - 2022-06-30T05:13:34+05:30 IST
అస్తవ్యస్తంగా హిమాయత్నగర్ రోడ్డు
మొయినాబాద్ రూరల్, జూన్ 29: అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో హిమాయత్నగర్ రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాల బారిన పడి గాయాలపాలవుతున్నారు. హిమాయత్నగర్లో కొన్నాళ్ల క్రితం సీసీ రోడ్డు పనులను ప్రారంభించి 70శాతం వరకు పనులు పూర్తిచేసి వదిలేశారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లే ఈ రోడ్డు పనులను అర్ధంతరంగా నిలిపివేసిన కాంట్రక్టర్ ఇటీవల రోడ్డు కొంత మేర తవ్వి వదిలేశారు. దీంతో రోడ్డు గుంతలమయమై చిన్నపాటి వర్షాలకే బురదగా మారింది. శని, ఆదివారాల్లో ఈ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీతో సమస్య తలెత్తుతోంది. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పనులను పూర్తి చేయించాని గ్రామస్థులు కోరుతున్నారు.