మెక్సికోలో రెండు డ్రగ్ గ్యాంగ్స్ మధ్య కాల్పులు.. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ మహిళ మృతి

ABN , First Publish Date - 2021-10-24T02:54:00+05:30 IST

బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అమెరికా నుంచి భర్తతో కలిసి మెక్సికో వెళ్లిన ఓ మహిళ రెండు డ్రగ్

మెక్సికోలో రెండు డ్రగ్ గ్యాంగ్స్ మధ్య కాల్పులు.. బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం వెళ్లిన హిమాచల్ ప్రదేశ్ మహిళ మృతి

సిమ్లా: బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం అమెరికా నుంచి భర్తతో కలిసి మెక్సికో వెళ్లిన ఓ మహిళ రెండు డ్రగ్ గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అంజలి రియోట్ కాలిఫోర్నియాలో నివసిస్తున్నారు. ఈ నెల 22న 30వ బర్త్ డే జరుపుకునేందుకు భర్త ఉత్కర్ష్ శ్రీవాస్తవతో కలిసి మెక్సికో వెళ్లారు. తులుమ్‌లో డిన్నర్ తర్వాత ఐస్‌క్రీమ్ తీసుకుంటున్న సమయంలో జరిగిన కాల్పుల్లో అంజలి మరణించినట్టు ఉత్కర్ష్ తెలిపారు.


ఈ విషయాన్ని ఆమె సోదరుడు ఆశిష్‌కు సమాచారం అందించారు. ఆశిష్ ఈ విషయాన్ని ఈ నెల 21న తండ్రికి తెలియజేశారు. కాగా, ఈ కాల్పుల్లో ఓ జర్మనీ మహిళా కూడా మృతి చెందింది.


అంజలి ఈ ఏడాది జులై నుంచి లింకిడిన్‌లో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆమె యాహూలో పనిచేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన అంజలి భర్త ఉత్కర్ష్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.


అంజలి మృతి వార్త తెలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని ఆమె కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కరోనా వైరస్ సమయంలో గతేడాది ఆమె సోలాన్‌లో తమతో కలిసి మూడు నాలుగు నెలలు గడిపిందని ఆమె తండ్రి కేడీ రియోట్ గుర్తు చేసుకున్నారు. ఆమె మరణించిందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-24T02:54:00+05:30 IST