అక్కను బస్టాండ్ వద్ద దింపి.. తమ్ముడు ఇంటికి వెళ్లి వచ్చేసరికి..
ABN , First Publish Date - 2020-08-10T20:53:54+05:30 IST
జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీ వద్ద రైల్వే ట్రాక్పై శనివారం రాత్రి బీఈడీ..
రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య
మంచిర్యాల టౌన్(అదిలాబాద్): జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీ వద్ద రైల్వే ట్రాక్పై శనివారం రాత్రి బీఈడీ రెండో సంవత్సరం చుదువుతున్న విద్యార్థిని గూడ్స్ రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని రాళ్లపేటకు చెందిన ఉత్తిపల్లి చంద్రమౌళి-రమణమ్మ దంపతుల నాలుగో కుమార్తె శిరీష (23) శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి తన తమ్ముడితో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లింది. స్థానిక బస్టాండ్ సమీపంలో ఆమెను దింపి, మార్కెట్కు వెళ్లిన మరో అక్కను ఇంటి వద్ద దింపేందుకు తన తమ్ముడు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి బస్టాండ్ సమీపంలో శిరీష కనిపించలేదు. ఫోన్ మోగుతున్నా ఎత్తకపోయేసరికి ఆమె కోసం చుట్టు పక్కల వెతకాడు.
ఇంతలో రైల్వే ట్రాక్పై యువతి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. హెడ్కానిస్టేబుల్ సంపత్ శిరీష కుటుంబ సభ్యుల కు సమాచారం అందించారు. కాగా శిరీష పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో బీఈడీ చదువుతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతుండేదని, కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితం కావడంతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారని హెడ్కానిస్టేబుల్ తెలిపారు. కేసు నమోదు చేసి, ధర్యాప్తు జరుపుతున్న ట్లు ఆయన తెలిపారు.