హైకోర్టు సీజేగా మునీశ్వరనాథ్ భండారీ
ABN , First Publish Date - 2022-02-11T13:29:29+05:30 IST
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మునీశ్వరనాథ్ భండారీ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం గత వా
చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మునీశ్వరనాథ్ భండారీ నియమితులయ్యారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న ఆయనను ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం గత వారం చేసిన సిఫారసును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించిన నేపథ్యంలో ఆ మేరకు కేంద్రప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.