30 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వేందుకు యత్నం.. కవిపురంలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-02-21T19:13:25+05:30 IST

కృష్ణా జిల్లా పెడన రూరల్ మండలం కవిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 30 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వేందుకు యత్నించారు.

30 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వేందుకు యత్నం.. కవిపురంలో ఉద్రిక్తత

విజయవాడ : కృష్ణా జిల్లా పెడన రూరల్ మండలం కవిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 30 ఎకరాల్లో చేపల చెరువులు తవ్వేందుకు యత్నించారు. గతంలో అడ్డుకొని గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తమకు, పంచాయితీ సభ్యులకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు పోలీసు రక్షణతో ప్రొక్లైనర్‌తో వచ్చిన భీమవరం వ్యాపారస్తులు రాగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పురుగుమందు తాగేందుకు గ్రామస్తుడు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. 

Updated Date - 2022-02-21T19:13:25+05:30 IST