Begumpet airportలో భారీ భద్రత

ABN , First Publish Date - 2022-07-02T15:17:02+05:30 IST

బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet airport)లో భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) తలపెట్టిన

Begumpet airportలో భారీ భద్రత

Hyderabad : బేగంపేట ఎయిర్‌పోర్టు(Begumpet airport)లో భారీ భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. బీజేపీ(BJP), టీఆర్ఎస్(TRS) తలపెట్టిన పోటాపోటీ కార్యక్రమాలతో పోలీసులు హై అలర్ట్(High Alert) అయ్యారు. రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yaswanth Sinha) ర్యాలీలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్‌పోర్టుకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి జలవిహార్ వరకూ యశ్వంత్ సిన్హా ర్యాలీ జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-07-02T15:17:02+05:30 IST