పదో తరగతి విద్యార్థిని దండించిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్
ABN , First Publish Date - 2022-08-18T06:00:15+05:30 IST
మార్టేరులోని ఎస్వీజీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో వెంకట రమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంఈవో విచారణ.. ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో
పెనుమంట్ర, ఆగస్టు 17: మార్టేరులోని ఎస్వీజీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో వెంకట రమణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్స వానికి ముందుగా పాఠశాలలో ఏర్పాట్లు చేస్తుండగా ఉపాధ్యాయుడు రవీంద్ర పదో తరగతి విద్యార్థిని చితక బాదడంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. వెం టనే ఉపాధ్యాయులు పీహెచ్సీకి తీసుకువెళ్ళి వైద్యం చేయించారు. ఈ సంఘట నపై విద్యార్థిని తల్లిదండ్రులు మంగళవారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. హెచ్ఎం సీహెచ్.శివజ్యోతి వారితో చర్చించి ఎంఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎంఈవో డి.శారదాజోత్స్న బుధవారం విచార ణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. నివేదిక పరిశీలించి ఉపాధ్యా యుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు.