తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించవచ్చు

ABN , First Publish Date - 2022-07-03T05:18:44+05:30 IST

రైతులు సాగు చేసే పంటలను తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు అ న్నారు.

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించవచ్చు

వల్లూరు, జూలై 2: రైతులు సాగు చేసే పంటలను తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని బాలగారిపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భం గా రైతులతో మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూ చించారు. ఎక్కువ మోతాదులో వాడడం వలన దిగుబడి తగ్గుతుందన్నారు. రైతుల కోసమే రైతు భ రాసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రైతులకు కావలసిన సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఆర్బీకేల ద్వారా సమాచారాన్ని పొంది పంటల సాగు చేసుకోవాలన్నారు. ఈ పొలం బడి కార్యక్రమం 14 రోజుల పాటు గ్రామంలో నిర్వహిస్తున్నట్లు సిబ్బంది అందుబాటులో ఉంటారిన రైతులకు కావలసిన మెలుకువలను కూడా నేర్పిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏవో సాయిజ్యోతి, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:18:44+05:30 IST