మంత్రి కాలేజీలో ఫీజులు ఘనం: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2020-06-07T08:52:40+05:30 IST

ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల ఖరారు నిష్పక్షపాతంగా జరగాలి. సౌకర్యాలు, అర్హతలనుబట్టి వాటిని ఖరారు చేయాలి. కాని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకాశం జిల్లాలోని తన ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏడాది ఫీజు

మంత్రి కాలేజీలో ఫీజులు ఘనం: ధూళిపాళ్ల

అమరావతి, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): ‘‘ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల ఖరారు నిష్పక్షపాతంగా జరగాలి. సౌకర్యాలు, అర్హతలనుబట్టి వాటిని ఖరారు చేయాలి. కాని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ప్రకాశం జిల్లాలోని తన ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏడాది ఫీజు రూ.54వేలుగా ఖరారు చేయించుకొన్నారు. అదే జిల్లాలో అంతకంటే మెరుగ్గా ఉన్న ఇతర కళాశాలలకు మాత్రం రూ.35వేలు పెట్టించారు. కమిటీ పేరు చెప్పి ఇష్టానుసారం చేస్తున్నారు’’ అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Updated Date - 2020-06-07T08:52:40+05:30 IST