తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు స్టే

ABN , First Publish Date - 2022-03-22T22:37:23+05:30 IST

తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు

తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు స్టే

అమరావతి: తిరుచానూరు పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్‌గా మార్చడంపై హైకోర్టు స్టే విధించింది. పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు వినియోగించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ వాదనలతో  ఏపీ హైకోర్టు ఏకీభవించింది. కలెక్టర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌పై స్టేటస్‌కో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. భవనంలో ఎలాంటి మార్పులు చేయొద్దని హైకోర్టు స్పష్టీకరణ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

Updated Date - 2022-03-22T22:37:23+05:30 IST